ఏపీలో తొలి ‘లోకల్’ కరోనా పాజిటివ్ కేసు..బీ అలెర్ట్..
కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పటివరకు మెరుగైన పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్లో క్రమక్రమంగా ఆందోళన నెలకుంటుంది. తాజాగా రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సౌదీ అరేబియా నుంచి వైజాగ్ వచ్చిన వ్యక్తికి రిలేషన్ అయిన మహిళ(49)కు కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్దారించారు. స్టేట్లో కరోనా సోకిన మొదటి మహిళ కూడా ఈమే అవ్వడం గమనార్హం. దీంతో ఏపీలో తొలి లొకల్ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అంతకుముందు వరకు విదేశాలకు వెళ్లి […]
కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పటివరకు మెరుగైన పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్లో క్రమక్రమంగా ఆందోళన నెలకుంటుంది. తాజాగా రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సౌదీ అరేబియా నుంచి వైజాగ్ వచ్చిన వ్యక్తికి రిలేషన్ అయిన మహిళ(49)కు కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్దారించారు. స్టేట్లో కరోనా సోకిన మొదటి మహిళ కూడా ఈమే అవ్వడం గమనార్హం. దీంతో ఏపీలో తొలి లొకల్ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అంతకుముందు వరకు విదేశాలకు వెళ్లి వచ్చినవారికే కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య 6కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఫారెన్ నుంచి వచ్చినవారితో జాగ్రత్తలు వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ పౌరులకు సూచనలు చేసింది. ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు 13,301మంది రాగా..వారిలో 11,206 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 2,222 మందికి ఇంట్లోనే 28 రోజుల హోమ్ ఐసోలేషన్ పూర్తయిందని సర్కార్ తెలిపింది. 53 మందిని ఆస్పత్రులకు తరలించి డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది. మరో 16 మందికి సంబంధించిన టెస్ట్ల రిపోర్ట్ రావాల్సి ఉన్నట్లు వివరించింది.