కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ శాఖ గుడ్న్యూస్…
కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు లబ్ది చేకూరేలా పెండింగ్లో ఉన్న రిఫండ్లను వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దేశంలో కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోన్న వేళ.. టాక్స్ పేయర్స్ కు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. 5 లక్షలలోపు ఉన్న రిఫండ్లను తక్షణమే విడుదల చేయనున్నారు. ఆదాయపు […]
కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు లబ్ది చేకూరేలా పెండింగ్లో ఉన్న రిఫండ్లను వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దేశంలో కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోన్న వేళ.. టాక్స్ పేయర్స్ కు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.
5 లక్షలలోపు ఉన్న రిఫండ్లను తక్షణమే విడుదల చేయనున్నారు. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఊరట లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్ కేటగిరీలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపార వర్గాలకు ఉపశమనం లభించనుంది. ఎంఎస్ఎంఈలకు కూడా ఇది వర్తిస్తుంది. మొత్తం రూ.18 వేల కోట్లను రిఫండ్ల చెల్లింపుల కోసం రిలీజ్ చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.