Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఈ నెల 30లోగా సీట్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రీఫండ్..

ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (AICTE) గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 30వ తేదీలోపు  ఇంజనీరింగ్...

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఈ నెల 30లోగా సీట్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రీఫండ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 19, 2020 | 1:49 PM

ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (AICTE) గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 30వ తేదీలోపు  ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సుల్లో సీట్లు రద్దు చేసుకున్న విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఫండ్ చేయడంతో పాటు టీసీలు, డాక్యుమెంట్లు కూడా ఇచ్చేయాలంటూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కేవలం ప్రాసెసింగ్ ఫీజు కింద గరిష్టంగా రూ. 1000 మాత్రమే మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లోపు వాపసు ఇచ్చేయాలని అందులో పేర్కొంది. ఇక టెక్నికల్ కోర్సుల్లో సీట్లు రద్దు చేసుకునే గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలు జరుగుతున్న నేపధ్యంలో అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో మార్పులు చేసినట్లు తెలిపింది.

కాగా, ఖాళీ సీట్లలో విధ్యార్ధులను చేర్చుకోవడానికి ఏఐసీటీఈ డిసెంబర్ 5 వరకు గడువును పొడిగించింది. డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 30లోపు సీట్లు రద్దు చేసుకున్న విద్యార్ధులకు మొత్తం ఫీజు చెల్లించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి సెమిస్టర్ ఫీజు డిమాండ్ చేయకూడదని స్పష్టం చేసింది.

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..