Telangana: బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.. వింటే ఒళ్లు జలదరించాల్సిందే
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం శివారులో తెల్లవారుజామున రహదారిపై పూర్తిగా కారు కాలిపోయింది. పెను ప్రమాదం నుంచి 8 మంది కుటుంబ సభ్యులు బయటపడ్డారు. రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఆరేళ్ల బాలుడు తన కుటుంబం ప్రాణాలు కాపాడాడు. దైవదర్శనానికి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాలుడు చేసిన ఒక్క పనితో ఎనిమిదిమంది సజీవ దహనం కాకుండా ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి కారులో ఆరేళ్ల బాలుడు సహా ఎనిమిది మంది దేవుని దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో బాలుడు బహిర్భూమికి వస్తోంది కారు ఆపాలని బాలుడు పేరెంట్స్కి చెప్పాడు.
వారు వెంటనే డ్రైవర్ను కారు ఆపమని చెప్పడంతో డ్రైవర్ కారు పక్కకు ఆపాడు. కొద్దిసేపటికి కారులో నుంచి పొగలు రావటాన్ని గమనించాడు డ్రైవర్. వెంటనే కారులో ఉన్నవారిని అప్రమత్తం చేసి కిందికి దింపాడు. మరుక్షణంలో మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం కారు మంటల్లో కాలిపోయింది. అర్పెందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. కారు మొత్తం క్షణాల్లో బూడిదైపోయింది. అది చుసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. బాహిర్బుమి కోసం బాలుడు కారు ఆపి ఉండకపోయి ఉంటే ఏం జరిగేదో అని అంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం సభ్యులను వేరే వాహనంలో ఇంటికి పంపారు పోలీసులు.
