AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Reforms in India: 2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

2026లో భారత్ స్వరూపమే మారిపోతోంది. కొత్త సంవత్సరం బెల్స్ మోగుతుంటే.. మన దేశంలో నిబంధనల విప్లవం మొదలవుతోంది. బ్యాంకింగ్, వ్యవసాయం, ట్యాక్స్, ఇంటర్నెట్.. ఇలా ప్రతీ రంగంలోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జీవితంపై ఈ కొత్త రూల్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో కళ్లకు కట్టినట్టు చెప్పే కథనం ఇది. కాబట్టి అవేంటో చూద్దాం పదండి.

Upcoming Reforms in India: 2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
Upcoming Reforms In India 2026
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 11:35 AM

Share

2026లో భారత్ స్వరూపమే మారిపోతోంది. కొత్త సంవత్సరం బెల్స్ మోగుతుంటే.. మన దేశంలో నిబంధనల విప్లవం మొదలవుతోంది. బ్యాంకింగ్, వ్యవసాయం, ట్యాక్స్, ఇంటర్నెట్.. ఇలా ప్రతీ రంగంలోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జీవితంపై ఈ కొత్త రూల్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో కళ్లకు కట్టినట్టు చెప్పే కథనం ఇది. కాబట్టి అవేంటో చూద్దాం పదండి.

ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ

పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడబోతున్నాం. జనవరి 1, 2026 నుంచి 8వ పే కమిషన్ అమల్లోకి రాబోతోంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగుల జీతాలు 25% నుంచి 30% పెరిగే ఛాన్స్ ఉంది. కనీస వేతనం రూ.18,000 నుంచి ఏకంగా రూ.41,000 వరకు వెళ్లే అవకాశం. పెన్షనర్స్ కి కూడా ఇది గుడ్ న్యూస్. పెరిగిన ధరలకి తగ్గట్టుగా జేబు నిండబోతోంది.

​అన్నదాతకు ‘డిజిటల్’ పరీక్ష

రైతు బంధు లాంటి పీఎం కిసాన్ డబ్బులు కావాలంటే ఇక పాత పద్ధతులు కుదరవు. జనవరి 1 నుంచి రైతులందరికీ ‘ఫార్మర్ ఐడీ’ (Farmer ID) తప్పనిసరి. భూమి రికార్డులు, పంట వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ​ఈ ఐడీ ఉంటేనే రూ.6000 ఖాతాలో పడతాయి. టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఈజీనే.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం రాని మన పల్లెటూరి రైతులకి ఇది కాస్త ఇబ్బందే.

పాన్-ఆధార్.. డెడ్ లైన్ ముగిసింది

ఇన్నాళ్లు చెబుతూనే ఉన్నారు.. ఇప్పుడు మాత్రం సీరియస్. డిసెంబర్ 31, 2025 లోపు పాన్-ఆధార్ లింక్ చేయని వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరమే. ​జనవరి 1 నుంచి లింక్ లేని పాన్ కార్డ్ చెల్లదు, ​బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు, లోన్ రాదు, రీఫండ్ రాదు.. పైగా రూ.1000 ఫైన్ కట్టాల్సిందే. ఇది నిజంగా ట్యాక్స్ ఎగవేసే వాళ్ళకి చెక్ పెట్టే చర్యే.

లోన్ కావాలా? వారానికోసారి మీ జాతకం మారుతుంది

ఇప్పటివరకు మన సిబిల్ స్కోర్  ఎప్పుడో నెలకు, రెండు నెలలకో అప్డేట్ అయ్యేది. కానీ ఏప్రిల్ 2026 నుంచి రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్ తెచ్చింది. ఇక వారానికోసారి మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుంది.​మీరు ఈఎంఐ టైంకి కడితే.. వెంటనే స్కోర్ పెరుగుతుంది, లోన్ ఈజీగా దొరుకుతుంది. లేట్ చేశారో.. వెంటనే స్కోర్ పడిపోతుంది. జాగ్రత్త సుమీ!

వాట్సాప్ వాడుతున్నారా? సిమ్ కార్డు ఫోన్లోనే ఉండాలి

సైబర్ నేరగాళ్ళకి చెక్ పెట్టడానికి ప్రభుత్వం తెస్తున్న సంచలన నిర్ణయం ఇది. ఫిబ్రవరి 2026 కల్లా.. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వాడాలంటే మీ ఫోన్లో ఆ సిమ్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ​ఫ్రాడ్ చేసేవాళ్ళు సిమ్ తీసేసి, వైఫై ద్వారా మోసాలు చేస్తున్నారు. ఇక ఆ ఆటలు సాగవు. కానీ, ప్రైవసీ కోరుకునే వాళ్ళకి, జర్నలిస్టులకి ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే.

ట్యాక్స్ చట్టం.. కొత్త రూపం

60 ఏళ్ల నాటి పాత చట్టం పోయి.. ‘ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025’ రాబోతోంది. ఫార్మ్స్ అన్నీ సింపుల్ గా మారిపోతాయి. అంతా ఆన్లైన్.. ఆటోమేటిక్. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది.

గ్యాస్ ధరలు తగ్గుముఖం

ఇదొక్కటి సామాన్యుడికి నిజమైన ఊరట. గ్యాస్, సీఎన్జీ  ధరలు తగ్గే అవకాశం ఉంది. ‘వన్ నేషన్ – వన్ గ్రిడ్’ కింద ధరలు తగ్గించడం ద్వారా వంటింటి బడ్జెట్ కు కాస్త రిలీఫ్ దొరకనుంది.

2026 అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు.. మన లైఫ్ స్టైల్ మారుతోంది. ప్రభుత్వం అంతా ‘డిజిటల్’ మయం చేస్తోంది. అవినీతి తగ్గడానికి ఇది మంచిదే అయినా.. టెక్నాలజీ రాని సామాన్యుడికి మాత్రం కొన్ని రోజులు తిప్పలు తప్పకపోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.