నేపాల్లో భారీ వరదలు.. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ CEO గల్లంతు!
నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతైనట్లు సమాచారం. వ్యక్తిగత పనుల కోసం నేపాల్ వెళ్లిన ఆయనతో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం స్థానిక అధికారులతో కలిసి ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 29, 2026
- 6:37 am
Jio: ఐపీఓకు జియో.. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు రెడీ అయింది. ఆ కంపెనీ సమర్పించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. దీంతో ఇది ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. భారతదేశపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్లలో ఇది ఒకటిగా నిలవనుందని చెప్పవచ్చు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 28, 2026
- 6:14 pm
Tea Production: తేయాకు ఉత్పత్తిలో అగ్ర స్థానం ఆ దేశానిదే..! భారత్ స్థానమేంటో తెలుసా?
ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా ఏకంగా 53 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 7.05 మిలియన్ మెట్రిక్ టన్నుల టీ ఉత్పత్తి కాగా, చైనా 3.74 మిలియన్ టన్నులతో తొలి స్థానంలో నిలిచింది. భారత్ 1.28 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టీ ఉత్పత్తిలో ఆసియా దేశాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, వాతావరణ మార్పులు, పెరుగుతున్న గ్రీన్ టీ, బ్లాక్ టీ డిమాండ్ భవిష్యత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 22, 2026
- 11:32 am
Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా వంటి అగ్రదేశాలను వెనక్కి నెట్టి 70.1% ఏఐ వాడకంతో దూసుకెళ్లింది. ప్రభుత్వ సేవలు, విద్య, వ్యాపార రంగాల్లో ఏఐని వేగంగా అనుసంధానం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులే దీనికి కారణం. ఏఐ ఆర్థిక పురోగతికి కీలకం కానుంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 21, 2026
- 4:20 pm
Google: రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్
Google: రాబోయే రోజుల్లో మిగతా దిగ్గజ టెక్ సంస్థలు సైతం ఇటువంటి కార్పొరేట్ డేటాను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టు తుది ఆమోదం లభించిన వెంటనే ఈ డేటా మొత్తం అధికారికంగా గూగుల్ సర్వర్లలోకి చేరుతుంది. భవిష్యత్తులో విమానయాన..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 19, 2026
- 4:09 pm
కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
వందేళ్ల క్రితం సరదాగా, మాంసం కోసం భారత్ నుంచి టెక్సాస్కు తీసుకెళ్లిన నీల్గాయ్లు.. ఇప్పుడు అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తీసుకెళ్లినప్పుడు కేవలం 10 సంఖ్యంలో ఉన్న ఈ జంతువులు.. ఇప్పుడు వేలల్లోకి పెరిగి స్థానిక రైతులను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు అమెరికాలో మన నీల్గాయ్ల హవా ఏంటి? తెలుసుకుందాం పదండి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 10, 2026
- 8:26 am
US Debt: బయటపడ్డ ప్రపంచ దేశాల అప్పులు.. తొలి స్థానంలో అమెరికా.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అప్పులు ఉన్న దేశాల జాబితా విడుదలైంది. ఇందులో అమెరికా తొలి స్థానంలో ఉండటం ఆర్ధిక నిపులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా.. అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. భారత్ ఏ స్థానంలో ఉందంటే..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 7, 2026
- 3:32 pm
ఆన్లైన్లో చవక నగలు కొంటున్నారా? జాగ్రత్త.. 9000 రెట్లు క్యాన్సర్ కారకాల గుర్తింపు!
ఆన్లైన్లో చవకగా విక్రయిస్తున్న వెండి, ఫ్యాషన్ ఆభరణాల్లో క్యాన్సర్కు కారణమయ్యే కాడ్మియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని నగల్లో చట్టబద్ధ పరిమితి కంటే 9,000 రెట్లు ఎక్కువ కాడ్మియం గుర్తించారు. ముఖ్యంగా పిల్లలకు ఇవి తీవ్ర ఆరోగ్య ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jul 28, 2026
- 11:11 am
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంత్రోపిక్ సంస్థ 1.5 బిలియన్ డాలర్ల కాపీరైట్ ఒప్పందంతో సంచలనం సృష్టించింది. క్లాడ్ ఓపస్ 5, ChatGPT హెల్త్ వంటి కొత్త మోడల్స్ ఆవిష్కరణలు వచ్చాయి. AI భద్రత, విద్యుత్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటా సెంటర్ల కోసం అణు విద్యుత్, సముద్ర గర్భ డేటా కేంద్రాలు వస్తున్నాయి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jul 27, 2026
- 11:24 am
ఏఐ స్పీడ్ మామూలుగా లేదు.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన టాప్ న్యూస్ ఇదే.. తెలుసుకోకపోతే మీరు వెనుకనే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఈ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏఐ ఆధారిత సైబర్ దాడులపై ప్రపంచ దేశాలకు హెచ్చరికల నుంచి, గూగుల్ జెమినీ కొత్త సామర్థ్యాలు, GPT-5 వైద్యరంగంలో చూపిన ప్రతిభ, మార్కెట్లోకి వచ్చిన కొత్త ఏఐ టూల్స్ వరకు టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రభావం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jun 29, 2026
- 12:47 pm
AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!
Artificial Intelligence: టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నిద్రపోతున్నా, మార్పు మాత్రం ఆగదు. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తుంది మన ఆశల మీద కాదు.. రాబోయే మార్పు మీద! ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. కంప్యూటర్లు వచ్చినప్పుడు, బ్యాంక్ ఉద్యోగులు ధర్నాలు..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 13, 2026
- 1:04 pm
ఏకంగా 149మందికి కేబినెట్ హోదా.. దుమారం రేపుతున్న సీఎం సిద్దరామయ్య నిర్ణయం..!
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాల తర్వాత విమర్శలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మంత్రి పదవుల సంఖ్య 32 నుండి 149కి పెరిగింది. సిద్దరామయ్య ప్రభుత్వం మరో 54 మందికి సహాయ మంత్రి (MoS) హోదాను కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, పాలన ప్రాధాన్యతల గురించి చర్చకు దారితీసింది. దీంత సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 10, 2026
- 9:11 am