ముంబైపై కచ్చితంగా గెలుస్తాం.. అదే మాకు కలిసొస్తుంది..
ఐపీఎల్ లీగ్ స్టేజి పూర్తయింది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. క్వాలిఫయర్ 1లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.
IPL 2020: ఐపీఎల్ లీగ్ స్టేజి పూర్తయింది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. క్వాలిఫయర్ 1లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో తాము కచ్చితంగా గెలుస్తామని ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తక్కువ మ్యాచ్లు ఆడాడు. అతడు అంతగా ఫామ్లో లేకపోవడంతో పాటు బ్యాటింగ్లో కూడా పెద్దగా టచ్లో లేదు. ఇక ఇదే ఢిల్లీకి కలిసొస్తుంది” అని ధావన్ పేర్కొన్నాడు.
Also Read: రోహిత్.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?