AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Everest: ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారి చేరుకున్నరోజుకు 68 ఏళ్లు..ఈ సాహసయాత్ర ఎలా సాగిందంటే..

Everest: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం.. అధిరోహించాలని ఎన్నో ప్రయత్నాలు.. చివరికి ఇద్దరు సాధించారు. ఆ శిఖరం ఎవరెస్ట్.. ఆ ఇద్దరు న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ.. నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే.

Everest: ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారి చేరుకున్నరోజుకు 68 ఏళ్లు..ఈ సాహసయాత్ర ఎలా సాగిందంటే..
Everest
KVD Varma
|

Updated on: May 29, 2021 | 12:12 PM

Share

Everest: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం.. అధిరోహించాలని ఎన్నో ప్రయత్నాలు.. చివరికి ఇద్దరు సాధించారు. ఆ శిఖరం ఎవరెస్ట్.. ఆ ఇద్దరు న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ.. నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే. సరిగ్గా 68 ఏళ్ల క్రితం వారిద్దరూ చరిత్ర సృష్టించారు. 1953 సంవత్సరం.. మే నెల.. 29వ తేదీ..ఉదయం 11:30 గంటలకు ఈ అద్భుత విజయం సాధించారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంపై తొలిసారిగా అడుగుపెట్టిన మానవులుగా నిలిచారు. ఈ వార్తా సరిగ్గా నాలుగు రోజుల తరువాత జూన్ 2 న ప్రపంచానికి తెలిడింది.

క్లిష్టమైన మార్గం..

29 వేల 32 అడుగుల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం హిమాలయాలలో ఎత్తైన శిఖరం. చాలా చల్లని వాతావరణం. మంచు తుఫానుల కారణంగా నేరుగా ఎక్కడం చాలా కష్టమైన పని. అనేక ప్రయత్నాలు ఎంతమందో చేశారు. కానీ ఎవరూ శిఖరాగ్రాన్ని చేరుకోలేకపోయారు. బ్రిటన్ యాత్రలో భాగంగా 1921 లో ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహకుల బృందాన్ని పంపింది. భయంకరమైన మంచు తుఫాను వీరి మార్గాన్ని అడ్డుకుంది. దీంతో అందరూ మిషన్ అసంపూర్తిగా వదిలి తిరిగి వచ్చారు. ఈ ప్రయత్నం విఫలమైంది అయితే, సిబ్బందిలో సభ్యుడైన జార్జ్ లే మెల్లరీ శిఖరాగ్రానికి కొంచెం తేలికైన మార్గాన్ని చూశారు.

మరుసటి సంవత్సరం, మెలరీ ఎవరెస్ట్ శిఖరాన్ని మళ్లీ జయించటానికి బయలుదేరాడు. ఈ సమయం 27 వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలిగారు. కానీ, అప్పుడు మళ్ళీ వాతావరణం మద్దతు ఇవ్వలేదు. ఈ విధంగా, ఎవరెస్ట్‌ను జయించటానికి చాలానే ప్రయత్నాలు కొనసాగాయి. ఈ క్రమంలో 1952 లో, టెన్జింగ్ నార్గే 28 వేల 210 అడుగుల ఎత్తుకు చేరుకోవడం ద్వారా ఒక ఘనత సాధించాడు, కాని ఎవరెస్ట్ శిఖరానికి ఇంకా చాలా దూరంలో ఉండిపోయారు.

చివరికి చేరుకున్నారిలా..

మరుసటి సంవత్సరం కల్నల్ జాన్ హంట్ నేతృత్వంలోని ఒక బృందాన్ని ఎవరెస్ట్ శిఖరానికి పంపించడానికి బ్రిటన్ సిద్ధమైంది. టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ కూడా ఈ జట్టులో ఉన్నారు. పూర్తి సన్నాహాలతో ఈ బృందాన్ని మౌంట్ ఎవరెస్ట్‌కు పంపారు.

ఈ బృందం ఏప్రిల్ 1953 లో ఎవరెస్ట్ ఎక్కడం ప్రారంభించింది. ఈ బృందం 26 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. ముందుకు వెళ్లే రహదారి మరింత కష్టమైంది. మే 26 న, చార్లెస్ ఎవాన్స్, టామ్ బోర్డిలాన్, ఇద్దరు సిబ్బంది, వారి చివరి ఆరోహణను ప్రారంభించారు. శిఖరం నుండి 300 అడుగుల దూరంలో ఆక్సిజన్ మాస్క్ పనిచేయకపోవడం వల్ల ఇద్దరూ తిరిగి రావలసి వచ్చింది. మే 28 న పట్టువదలని ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఎక్కడం ప్రారంభించారు. ఒక రోజు అధిరోహణ తరువాత, భయంకరమైన మంచు తుఫాను, శీతాకాలం మధ్య 27 వేల 900 అడుగుల ఎత్తులో గడిపారు. ఆ పరిస్థితిని తట్టుకుని గడిపిన వారిద్దరూ తిరిగి ఉదయం మళ్ళీ ఎక్కడం ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు ఇద్దరూ ఉత్తర శిఖరానికి చేరుకున్నారు. ఎవరెస్ట్ పర్వతంపై ఇప్పుడు 40 అడుగుల ఎత్తులో మంచుతో నిండిన శిల ఉంది. తాడు సహాయంతో శిల మధ్యలో ఉన్న పగుళ్లు ద్వారా హిల్లరీ పైకి చేరుకున్నారు. వారు అక్కడ నుండి ఒక తాడు విసిరారు. నార్గే తాడు పట్టుకొని పైకి వచ్చాడు. ఇద్దరూ సరిగ్గా 11:30 గంటలకు ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకున్నారు.

Also Read: Mehul Choksi: ఇండియాకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అప్పగింతలో జాప్యం జరిగే సూచన, డొమినికా కోర్టు అడ్డుపుల్ల, జూన్ 2 న విచారణ

Banwarilal Purohit: చలించిన గవర్నర్.. వీధికుక్కలకు ఆహారం అందించేందుకు రూ.10 లక్షలు అందజేత