Measles: చిన్నారుల్లో మీజిల్స్‌ ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా భారీగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటోన్న నిపుణులు..

కరోనా మహమ్మారి తర్వాత మరో వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో మీజిల్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో తాజాగా మీజిల్స్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది...

Measles: చిన్నారుల్లో మీజిల్స్‌ ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా భారీగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటోన్న నిపుణులు..
Measles
Follow us

|

Updated on: Nov 29, 2022 | 12:04 PM

కరోనా మహమ్మారి తర్వాత మరో వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో మీజిల్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో తాజాగా మీజిల్స్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే మీజిల్స్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

మీజిల్స్ వ్యాధి ఇంతలా వ్యాప్తి చెందడానికి కరోనా కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మీజిల్స్‌ వ్యాక్సినేషన్‌ భారీగా తగ్గింది. దీంతో కోట్లాది మంది నవజాత శిశువుల్లో మీజిల్స్‌ వ్యాప్తి చెందుతోంది. తాజా నివేదికలో తేలిన అంశాల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ల మంది చిన్నారులు మీజిల్స్‌ టీకాకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల కొత్త మీజిల్స్‌ కేసులు నమోదయ్యాయి. 1.28 లక్షల మంది మరణించారు.

వీటిలో 95 శాతానికి పైగా మరణాలు ఆఫ్రికా, ఆసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించాయి. ప్రపంచంలోని దాదాపు 22 దేశాల్లో మీజిల్స్‌ వ్యాపించింది. ఇక మీజిల్స్‌ వ్యాధిని అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం. ఈ వ్యాధికి నిర్ధిష్టమైన చికిత్స లేపప్పటికీ టీకాలు 97 శాతం ప్రభావితంగా పనిచేస్తాయి. ఈ వ్యాధిని నివారించడానికి పిల్లలకు రెండు మోతాదుల్లో టీకా ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..