Anjeer Side effects: ఆరోగ్యానికి మంచిదని అంజీర్ పండ్లను ఎక్కువగా తింటున్నారా? చాలా డేంజర్

నిజానికి డ్రై ఫ్రూట్స్ ను ఏ సమయంలోనైనా తినొచ్చు. కానీ అవి కూడా అతిగా తినకూడదు..పరిమిత పరిమాణంలో కంటే ఎక్కువగా తినేస్తే.. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి పండ్లలో ఒకటి అత్తి(అంజీర్‌) పండ్లు.

Anjeer Side effects: ఆరోగ్యానికి మంచిదని అంజీర్ పండ్లను ఎక్కువగా తింటున్నారా? చాలా డేంజర్
Anjeer Benefits
Follow us

|

Updated on: Oct 07, 2022 | 10:53 AM

డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని భావిస్తారు. తరచుగా డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్‌ తినమని సిఫార్సు చేస్తారు. వాటిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే వీటిని హెల్తీ స్నాక్స్ అంటారు. డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్, ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి మెదడును రక్షిస్తాయి. అలాగే బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి. నిజానికి డ్రై ఫ్రూట్స్ ను ఏ సమయంలోనైనా తినొచ్చు. కానీ అవి కూడా అతిగా తినకూడదు..పరిమిత పరిమాణంలో కంటే ఎక్కువగా తినేస్తే.. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి పండ్లలో ఒకటి అత్తి(అంజీర్‌) పండ్లు. ఇవి పండు, డ్రై ఫ్రూట్స్‌గా కూడా లభిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబ‌ర్‌, కార్బోహైడ్రేట్స్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు అంజీర్ పండ్ల‌లో నిండి ఉండ‌టం వ‌ల్ల ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి. కానీ, అత్తి పండ్లను ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి హాని కలిస్తుందంటున్నారు నిపుణులు..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కాల్షియం లోపం: అత్తి పండ్లను ఎక్కువగా తినే వారి శరీరంలో కాల్షియం లోపించవచ్చు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్‌లో ఉండే ఆక్సలేట్లు మన శరీరంలోని కాల్షియం మొత్తాన్ని గ్రహిస్తాయి. కాల్షియం లేకపోవడం వల్ల మన ఎముకలు, శరీరం బలహీనపడతాయి.

2. కడుపు ఉబ్బరం కొంతమంది ఎండిన అత్తి పండ్లను మంచి రుచి కారణంగా ఎక్కువగా తినడం ప్రారంభిస్తారు. అయితే, దీని కారణంగా, కడుపు బరువుగా మారుతుంది. అప్పుడు కడుపు నొప్పి మరియు వాతం సమస్యలు తలెత్తుతాయి. దీన్ని నివారించడానికి మీరు అత్తి పండ్లను తిన్న తర్వాత ఒక గ్లాసు చల్లని నీరు త్రాగాలి.

ఇవి కూడా చదవండి

3. కిడ్నీ, మూత్రాశయ సమస్యలు మూత్రపిండాలు, మూత్రాశయ వ్యాధులు ఉన్నవారు అత్తి పండ్లను చాలా తక్కువ పరిమాణంలో తినాలి.. ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సలేట్ ఈ అవయవాలను దెబ్బతీస్తుంది. ఇది తెల్ల రక్త కణాలను తయారు చేసే ప్లీహాన్ని నాశనం చేస్తుంది.

4. రక్తస్రావం సమస్యలు అంజీర పండు ప్రభావం వేడిగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో దీనిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు, శీతాకాలంలో కూడా దీనిని సూచించిన పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే రక్తస్రావం సమస్య ఏర్పడవచ్చు.

5. కాలేయం, ప్రేగులకు నష్టం మీరు అవసరమైన దానికంటే ఎక్కువ అత్తి పండ్లను తింటే, మీ కాలేయంలో సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు, ప్రేగులలో అడ్డుపడే ప్రమాదం కూడా ఉంది. ఈ పండు యొక్క విత్తనాలు సులభంగా జీర్ణం కావు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..