AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Failure: రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

మధుమేహం దేశంలో ఎంతో మందికి వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా..

Kidney Failure: రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి
మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. అలాగే పక్కటెముకల క్రింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
Subhash Goud
|

Updated on: Dec 11, 2022 | 12:45 PM

Share

మధుమేహం దేశంలో ఎంతో మందికి వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. మధుమేహం ఉన్నవాళ్లు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోలేము. దీనిని అదుపు చేయకుంటే అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్‌కు సరైన సమయంలో చికిత్స చేయకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా డయాబెటిక్ రోగులు వారి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడం అవసరం.

  1. ఆహారంలో బెర్రీలను చేర్చండి: జామున్, దాని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ లైన్ ప్రకారం, ప్రతిరోజూ 100 గ్రాముల జామూన్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ స్థాయిలో అదుపులో ఉంటాయి.
  2. విటమిన్ సి తీసుకోండి: విటమిన్ సి చర్మానికే కాదు మధుమేహానికి కూడా మంచిది. ప్రతిరోజూ 600 mg విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా మెరుగుపడతాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. మీరు నారింజ, టమోటా, ఉసిరి తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
  3. క్యాప్సికమ్: క్యాప్సికమ్‌లలో ఇతర కూరగాయల కంటే తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు మంచి ఆహారంగా మారుతుంది. ఇది కాకుండా క్యాప్సికమ్ విటమిన్ సి గొప్ప మూలం. క్యాప్సికమ్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
  4. ఒత్తిడి తగ్గించుకోవాలి: తరచుగా వైద్యులు కూడా మధుమేహ రోగులకు ఒత్తిడిని తగ్గించుకోవాలని సలహా ఇస్తుంటారు. ఒత్తిడి లేదా డిప్రెషన్ మధుమేహ రోగులకు మంచిది కాదు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి