నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే, ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడినట్టే.. జాగ్రత్త..!

కాబట్టి ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మానేయాలి. అంతే కాదు ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందవు. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే, ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడినట్టే.. జాగ్రత్త..!
Drinking Water
Follow us

|

Updated on: Jan 27, 2023 | 1:24 PM

నీరు త్రాగడానికి సరైన మార్గం: మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. అయితే నీళ్లు తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శరీర అవసరాలలో 60 శాతం నీటితో ముడిపడి ఉంటుంది. నీరు మన శరీరానికి పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియ, ఉష్ణోగ్రత నియంత్రణ నుండి పోషక రవాణా వరకు అనేక ముఖ్యమైన విధులకు మన శరీరానికి నీరు అవసరం. దాహం, అనుభవం మీ మెదడు ఇచ్చేహెచ్చరిక సిగ్నల్‌. శరీరానికి నీరు అవసరం, మీరు డీహైడ్రేషన్‌తో ఉన్నారని చెప్పే మార్గం. మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. అయితే నీళ్లు తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నీరు తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నీళ్లు తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి: ఉదయాన్నే ప్రతిరోజూ 2 గ్లాసుల నీరు తాగడంతో మీ రోజును ప్రారంభించండి. ఎందుకంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల రోజంతా మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీళ్ళు తాగుతూనే రోజుని ప్రారంభించాలి. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఆహారంతో పాటు లేదా తిన్న వెంటనే నీళ్లు తాగరాదు. ఎందుకంటే ఆహారంతో పాటు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల గ్యాస్, గుండెల్లో మంట మొదలైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మానేయాలి. అంతే కాదు ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందవు. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

నిలబడి నీళ్లు తాగడం మానుకోవాలి : చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. అయితే దీనిని నివారించాలి. ఎందుకంటే నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎల్లప్పుడూ కూర్చుని నీరు తాగాలి. దీనితో పాటు సిప్ వాటర్ తీసుకోవాలి. నిలబడి నీరు తాగితే నేరుగా అది అన్నవాహిక ద్వారా పొట్ట కిందికి చేరుతుంది. ఇది ఖచ్చితంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కడుపులో ద్రవ సమతుల్యతను దెబ్బతీయడంతోపాటుగా ఇంకా అలాగే విషపూరితం, అజీర్ణతను కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..