AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control: మధ్యవయస్కులలో డయాబెటిస్ ఎందుకు పెరుగుతోంది?

Diabetes Control: మధుమేహం తీవ్రమైన వ్యాధి కావచ్చు.. కానీ ఇప్పుడు ఇది సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీంతో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది..

Diabetes Control: మధ్యవయస్కులలో డయాబెటిస్ ఎందుకు పెరుగుతోంది?
Subhash Goud
|

Updated on: Jun 27, 2022 | 7:59 AM

Share

Diabetes Control: మధుమేహం తీవ్రమైన వ్యాధి కావచ్చు.. కానీ ఇప్పుడు ఇది సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీంతో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది మందులు వాడుతూనే తమ జీవితాలను గడుపుతున్నారు. మధుమేహం కారణంగా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపు లేకుండా ఉంటుంది. 90 శాతం డయాబెటిస్ కేసులు చాలా ఆలస్యంగా గుర్తించబడుతున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కొంతకాలంగా మధుమేహం మనల్ని చుట్టుముట్టిందని కూడా తెలియదు. ఈ వ్యాధి లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. కానీ ఒకసారి అది సంభవించినట్లయితే దానిని అదుపులో పెట్టుకోవాలి తప్ప.. పూర్తిగా నిర్మూలించడానికి వీలుకాదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కలోంజీతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కలోంజీని ఉపయోగించడం ద్వారా మధుమేహ రోగులు తమను తాము ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో తెలుసుకోండి.

రాత్రి పడుకునే ముందు మీరు సోపు, తేనె నివారణను స్వీకరించాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉపవాసంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న రోగులు, సోపు, తేనె నివారణను స్వీకరించవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు సోపు గింజలను మెత్తగా నూరి అందులో కొద్దిగా తేనె కలుపుకుని సేవించాలి. మీకు కావాలంటే, మీరు సోపు గింజలను పచ్చిగా కూడా తినవచ్చు.

అధిక బీపీ ఉన్నవాళ్లు..

ఇవి కూడా చదవండి

అధిక బీపీ, మధుమేహంతో స్థూలకాయం సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలోంజి నీటిని తాగాలి. ఈ నీరు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని సరిచేస్తుంది. అలాగే ఇది ప్రేగుల సామర్థ్యాన్ని పెంచుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటే, మీ కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. కావాలంటే సోపు గింజల నీటిని మరిగించి తాగవచ్చు.

ఆకు కూరలు

మధుమేహం ఉన్నవారు రోజువారీ ఆహారంలో.. ఆకు కూరలు, కూరగాయలు, తాజా పడ్లు, ముడి ధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, పప్పులు లాంటివి తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే పుదినా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుదినను తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక షుగర్స్‌ లెవల్స్‌ను పెంచుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు. రోజు మొత్తం మీద పండ్లు, కూరగాయలు కనీసం మూడు సార్లు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు. అందుకే ఉదయపు అల్పాహారంలో కూడా ఇవి ఉండేలా చూసుకోవాలి. ఏ పదార్థం తయారు చేసుకున్నా అందులో కూర ముక్కలు, కూరగాయల తురుము వంటివి ఉండేలా చూసుకోవచ్చు.

మధ్యవయస్కులలో డయాబెటిస్ ఎందుకు పెరుగుతోంది?

ఇప్పుడున్న కాలంలో డయాబెటిస్‌ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, సరైన వ్యాయమాలు లేకపోవడం, అధిక ఒత్తిడి, కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉంటే ఈ కారణంగా షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అధిక మద్యపానం..

అధిక మద్యపాన సేవనం, పొగ తాగడం కూడా డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ఉండటం వల్ల కూడా ముందుగానే వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు. డయాబెటిస్‌ వచ్చాక జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి