AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఈ ఆహారాలు అస్సలు ముట్టుకోవద్దు..!

కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో పొటాషియం నిల్వ అవుతుంది. ఇది గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్యలు కలిగించవచ్చు. అరటి, కొబ్బరి వంటి పండ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో వీటిని పూర్తిగా మానేయడం అవసరం. అలాంటి ఆహారాలపై నిపుణులు ఏం సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఈ ఆహారాలు అస్సలు ముట్టుకోవద్దు..!
Healthy Kidneys
Prashanthi V
|

Updated on: Aug 01, 2025 | 8:19 AM

Share

మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో ఉన్న అనవసరమైన లవణాలను తొలగించడంలో సహాయపడతాయి. పొటాషియం అనే లవణం గుండె కొట్టుకోవడం, నరాలు పనిచేయడం, కండరాల కదలిక లాంటి పనుల్లో ముఖ్యమైనది. ఇది అవసరానికి మించి ఉన్నప్పుడు.. కిడ్నీల ద్వారా బయటికి పంపబడుతుంది.

అయితే కిడ్నీలు బలహీనపడినప్పుడు ఈ పని సరిగా జరగదు. ఫలితంగా పొటాషియం శరీరంలో ఎక్కువై ప్రమాదకర స్థాయికి చేరుతుంది. దీన్ని హైపర్‌కలీమియా (hyperkalemia) అంటారు.

కొబ్బరి, అరటిపండు ఎందుకు హానికరం..?

పెరిగిన పొటాషియం స్థాయిలు గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా అరటిపండు ఒకటి సుమారు 375 నుంచి 487 mg పొటాషియాన్ని కలిగి ఉంటుంది. అలాగే కొబ్బరికాయలోనూ పొటాషియం చాలా ఉంటుంది.

కిడ్నీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు కలిపి తినడం లేదా వేరువేరుగా తినడం కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం. ఎందుకంటే వీటిలోని ఎక్కువ పొటాషియం శరీరంలో నిల్వ ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఎక్కువ అయితే ఏమౌతుంది..?

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. పొటాషియం రక్తంలో నిల్వ ఉంటుంది. ఇది గుండె సరిగా కొట్టుకోకపోవడం, వాంతులు, అలసట, కండరాలు బలహీనపడడం లాంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన స్థాయికి వెళ్ళినప్పుడు. ఇది గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఉంది.

అందుకే కిడ్నీ జబ్బు ఉన్నవారు ఈ పండ్లను కొంచెం కూడా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒక్క పండులో ఎంత పొటాషియం ఉందో మనం అంచనా వేయలేము.

లక్షణాలు మొదట్లోనే కనిపించవు

ఒకవేళ మీరు ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారం తీసుకుంటే.. దీని ప్రభావం వెంటనే కనిపించదు. పొటాషియం మీ రక్తంలోకి చేరుతుంది. అప్పటికి మీరు లక్షణాలు గమనించే లోగా.. కిడ్నీల పనితీరును అది ఇప్పటికే దెబ్బతీసి ఉంటుంది. అందుకే ముందే జాగ్రత్త వహించాలి.

ఎలాంటి ఆహారాలు తినకూడదు..? కిడ్నీ జబ్బు ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా.. అరటిపండ్లు, కొబ్బరికాయ, నారింజ, పుచ్చకాయ, టమాటా, బంగాళాదుంపలు, పాలకూర, అవకాడో తినకూడదు.

ఎలాంటి ఆహారాలు తినొచ్చు..? యాపిల్, బెర్రీస్ (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటివి), ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లు పొటాషియం తక్కువగా ఉండడం వల్ల కిడ్నీలకు కొంతవరకు సురక్షితం.

కిడ్నీ జబ్బు ఉన్నవారు తమ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆరోగ్యంగా కనిపించే కొన్ని ఆహారాలు.. కిడ్నీ బలహీనంగా ఉన్నప్పుడు హానికరం కావచ్చు. ముఖ్యంగా అరటి, కొబ్బరి లాంటి పండ్లను పూర్తిగా మానేయడం వల్ల గుండెపోటు ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు. డాక్టర్ సలహా లేకుండా ఏదైనా ఆహారాన్ని తినకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)