AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం తాగిన వారు ఆ వ్యాధి బారిన పడే రిస్క్ ఎక్కువ..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!

Alcohol:  మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పటినుంచో నిపుణులు చెబుతున్న మాట. మద్యం కారణంగా ఎన్నోరకాల ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి.

Alcohol: మద్యం తాగిన వారు ఆ వ్యాధి బారిన పడే రిస్క్ ఎక్కువ..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!
Alcohol
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 16, 2021 | 9:59 AM

Share

Alcohol:  మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇది ఎప్పటినుంచో నిపుణులు చెబుతున్న మాట. మద్యం కారణంగా ఎన్నోరకాల ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో కేన్సర్ కూడా ఒకటి. కేన్సర్ లలో ఉన్న రకాలలో చాలా రకాలు మద్యం సేవించిన వారికి సంక్రమించే అవకాశం ఉంది. ఇలా మద్యం సేవించడం వల్ల కేన్సర్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గతేడాది 7,41,300 మంది. కేన్సర్ రోగుల్లో మద్యం వలన దీని బారిన పడిన వారు 4 శాతం. అంటే, ప్రతి 25 మంది కేన్సర్ రోగుల్లో మద్యం సేవించడం వల్ల ఒకరికి కేన్సర్ వచ్చింది. మద్యానికి సంబంధించిన ఈ పరిశోధనలో, ఈ కేసులలో ఎక్కువ భాగం కాలేయం, అన్నవాహిక, రొమ్ము కేన్సర్ కేసులే ఎక్కువ ఉన్నాయని తేలింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలో ఈ ఫలితాలను తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు 200 దేశాలలో మద్యం అమ్మకాలు, వైద్య రికార్డులు చూశారు. సైన్స్ జర్నల్ లాన్సెట్ ఆంకాలజీ లో ప్రచురితమైన పరిశోధనలో ఈ విషయాలను చెప్పారు.

ఈ జాబితాలో మంగోలియా మొదటి స్థానంలో ఉండగా, బ్రిటన్ 38 వ స్థానంలోఉంది. అతి తక్కువ కేసులతో కువైట్‌లో ఉంది . కొత్తగా 16,800 మంది కేన్సర్ రోగులు ఉన్నారు. ఈ కేసులకు కారణం మద్యం సేవించడం. ఈ విషయంలో అమెరికా కొంచెం మెరుగ్గా ఉంది. ఇక్కడ 3% కేన్సర్ కేసులు అధికంగా మద్యం సేవించడం వల్ల సంభవించాయి. అలాంటి రోగుల సంఖ్య 52,700 గా ఉంది. ఈ జాబితాలో మంగోలియా అగ్రస్థానంలో ఉంది. ప్రతి 10 మంది కేన్సర్ రోగులలో ఒకరు మద్యపానంతో ముడిపడి ఉన్నారు. అదేవిధంగా, ఆల్కహాల్ నిషేధించబడిన కువైట్లో, ఆల్కహాల్ సంబంధిత కేన్సర్ కేసులు అతి తక్కువగా ఉన్నట్టు నివేదిక తేల్చి చెప్పింది.

మద్యం సేవించడం వల్ల మహిళల్లో పురుషుల కంటే కేన్సర్ తక్కువ. ప్రపంచవ్యాప్తంగా బాధితుల్లో కేవలం 23% మంది మహిళలు మాత్రమే మద్యం సేవించడం వల్ల కేన్సర్ బారిన పడ్డారు. ఈ అధ్యయనం కోసం సేకరించిన నమూనా పరిమాణం ప్రకారం, మద్యం వలన 77% మంది పురుషులు, 23% మంది మహిళలు కేన్సర్ బారిన పడ్డారు.

పురుషులలో ప్రతి ఏడు కేసులలో ఒకటి అధికంగా మద్యపానంతో ముడిపడి ఉంటుంది. అలాంటి వారు రోజుకు కనీసం రెండు పెగ్స్ తాగే అలవాటు ఉన్నవారు. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, ఈ అధ్యయనం తాగుబోతులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని గురించి పరిశీలించలేదు.

Also Read: Dragon Fruit Benefits: డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు..!

Menstrual Health: మహిళలు రుతుక్రమం సమయంలో చేసే తప్పులు ఇవే.. ఈ సూచనలు పాటించాలంటున్న వైద్యులు