Vijay Deverakonda: పాక్తో యుద్ధం..’నేను సైతం’ అంటూ ఇండియన్ ఆర్మీకి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేశాడో తెలుసా?
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గొప్ప మనసు చాటుకున్నాడు.

పాకిస్తాన్ తో యుద్ధం వేళ ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు. పాక్ కుటిలత్వాన్ని దెబ్బతీస్తున్న తీరును మెచ్చుకుంటూ సైనికులకు సలామ్ చేస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ఇండియన్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు. ‘మీతో పాటు మేమున్నాం ధైర్యంగా ముందుకు సాగండి’ అంటూ మోటివేషనల్ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి అండగా తానున్నాంటూ అతను షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘నాట్ జస్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా` రాబోయే వారాలకు `రౌడీ బ్రాండ్ అమ్మకాల్లో కొంత భాగాన్ని భారత సాయుధ దళాలకు విరాళంగా అందిస్తాం. జై హింద్.. మీ విజయ్` అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న వేళ విజయ్ దేవర కొండ గొప్ప మనసుతో ఇలా ముందుకు రావడం అభినందనీయమంటూ సినీ అభిమానులు, నెటిజన్లు విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, రష్మిక మందన్నా, శోభిత ధూళిపాళ్ల, కొణిదెల ఉపాసన తదితర ప్రముఖులు భారత సైన్యానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. అలా చేస్తే.. శత్రువుకు సాయం చేసినట్టే. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఎస్. ఎస్. రాజమౌళి ట్వీట్..
If you see any movement of the Indian Army, don’t take pictures or videos.
Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.
Stay calm, alert and positive. Victory is ours. 🇮🇳
— rajamouli ss (@ssrajamouli) May 9, 2025
శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని రష్మిక మందన్నా పేర్కొంది. భారత్- పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఆమె పోస్ట్ వైరల్గా మారింది. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది రష్మిక .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.