Vijay Deverakonda: రౌడీ హీరోకు బీటౌన్ ఫిదా.. దేవరకొండ అబ్బాయికి బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు..
ఇటీవల లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్కు ఫిదా అవుతుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇండస్ట్రీలోనే క్రేజీ కథానాయికుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం విజయ్ ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. బీటౌన్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు రౌడీని సంప్రదించారట. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ దర్శకుడితో కలిసి ఇటీవల విజయ్ తో సినిమా గురించి మాట్లాడారని టాక్. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ విజయ్తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్లాన్ చేస్తున్నటు వార్తలు వినిపిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అలాగే పూరి దర్శకత్వంలో విజయ్ చేయాల్సిన జనగణమన చిత్రం ప్రస్తుతం షూటింగ్ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ విజయ్ ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.