Ponniyin Selvan: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగంటే..

విక్రమ్ చియాన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. చోళ రాజవంశం వారసత్వం గురించి తెరకెక్కించిన ఈ మూవీకి తమిళనాడులో ఊహించని రెస్పాన్స్

Ponniyin Selvan: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగంటే..
Ponniyin Selvan
Follow us

|

Updated on: Nov 04, 2022 | 9:27 AM

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మణి. మొత్తం ఐదు భాగాలున్న ఈ నవలను రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సెప్టెంబర్ 30న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో తెరకెక్కిన ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇందులో విక్రమ్ చియాన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. చోళ రాజవంశం వారసత్వం గురించి తెరకెక్కించిన ఈ మూవీకి తమిళనాడులో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక కొద్ది రోజులుగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రెంటల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఉచితంగా ప్రసారం కానుంది. ఇక ఇప్పటివరకు ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇకపై ఫ్రీగా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

చోళ రాజవంంశం వారసత్వం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా.. ఓవర్సీస్ సహా పలు ఏరియాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.