AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: ఎనిమిదేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న త్రిష..

అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పించింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించింది. మొన్నామధ్య ఆచార్య సినిమాలో నటిస్తుందని టాక్ వచ్చింది అలాగే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం త్రిష తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Trisha Krishnan: ఎనిమిదేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న త్రిష..
Trisha
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2023 | 9:36 AM

Share

త్రిష.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది. యంగ్ అండ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తమిళ్ లోను సినిమాలు చేసింది. అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పించింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించింది. మొన్నామధ్య ఆచార్య సినిమాలో నటిస్తుందని టాక్ వచ్చింది అలాగే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం త్రిష తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాలో నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష ఓ కొత్త సినిమాను ఓకే చేసిందని తెలుస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన త్రిష నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియాన్ 2 సినిమాలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 తర్వాత మరో సినిమా చేయనున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుందని తెలుస్తోంది. గతంలో కమల్ హాసన్ త్రిష కాంబినేషన్ లో.. చీకటి రాజ్యం, మన్మథ బాణం ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి కమల్ , త్రిష కలిసి నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇక ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుంది. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసం త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కొన్ని వార్తలు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.