AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73)కన్నుమూశారు. బుధవారం (సెప్టెంబర్‌ 13) సాయంత్రం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోన ఉన్న తన నివాసంలో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
Producer Gogineni Prasad
Srilakshmi C
|

Updated on: Sep 14, 2023 | 1:59 PM

Share

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73)కన్నుమూశారు. బుధవారం (సెప్టెంబర్‌ 13) సాయంత్రం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోన ఉన్న తన నివాసంలో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాత గోగినేని ప్రసాద్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కాగా గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక సీనియర్‌ నటీనటులు కైకాల సత్యనారాయణ, కృష్ణా, జమున, విజయ నిర్మల, కళాతపస్వి కె విశ్వనాథ్‌, ఆయన సతీమణి, నందమూరి తారక్‌, శరత్‌బాబు, కృష్ణం రాజు.. ఇలా ఒకరి వెంట ఒకరుగా కానరాని లోకాలకు పయనమయ్యారు. టాలీవుడ్‌ ఈ విషాదాల నుంచి కోలుకోకముందే తాజాగా నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూయడంతో విషాదం నెలకొంది.

నిర్మాత గోగినేని ప్రసాద్ ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’, ‘పల్నాటి పులి’ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ మువీలను నిర్మించారు. తెలుగు టాప్ హీరోలతో ఆయన పలు సినిమాలు తెరకెక్కించారు. వయోభారం కారణంగా ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మరణించారు. గోగినేని ప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికాలో స్థిరపడగా ఆయన నగరంలో తన నివాసంలో ఉంటున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ఇద్దరు తమిళ కమెడియన్స్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ముకేశ్ ఉదేశి సైతం అనారోగ్యంతో మరణించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న ఆయనకు మరికొన్ని రోజుల్లో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి ఉంది. కానీ అంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..