Tollywood: ‘ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా’.. రెండో వివాహంపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఈ హీరోయిన్ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ తోనూ వార్తల్లో నిలిచింది.

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ లు, రిలేషన్ షిప్ లు, లవ్, బ్రేకప్పులు, డైవోర్సులు సహజమే. కానీ చాలామంది వీటి గురించి ఓపెన్ గా మాట్లాడతారు. కొద్ది మంది మాత్రమే ధైర్యంగా తమ పర్సనల్ విషయాలను బయటపెడతారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ క్రమంగా గ్లామరస్ పోల్స్ తో ఆడియెన్స్ కు చేరువైంది. కొన్ని సినిమాల్లో బోల్డ్ గానూ నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన పర్సనల్ లైఫ్ తోనూ వార్తల్లో నిలిచిందీ అందాల తార. ముఖ్యంగా పెళ్లి విషయంలో.. మొదట ఓ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. అయితే ఏమైందో తెలియదు కానీ మూడేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ఓ బిజినెస్ మెన్ తో ప్రేమలో పడింది. అతనితో కలిసి రెండోసారి పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు పుట్టాడు. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తన సెకెండ్ మ్యారేజ్, ప్రెగ్నెన్సీ గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ప్రెగ్నెంట్ అయ్యాకనే తాను పెళ్లి చేసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇలా తన కామెంట్స్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు అమలా పాల్.
తాజాగా జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అమలాపాల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగత్ దేశాయ్ తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయటపెట్టింది అమల పాల్. ‘జగత్-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలోనే సెటిలయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు పెద్దగా చూడడు. నేను కూడా హీరోయిన్ అనే విషయాన్ని కూడా చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను హీరోయిన్ అన్న విషయాన్ని జగత్ తో చెప్పాను. ఆ తర్వాత నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు’ అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.
అమలా పాల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
అమలా పాల్ మొదట డైరక్టర్ ఏఎల్ విజయ్ ని 2014లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా మూడేళ్లకే అంటే 2017లో విడాకులు తీసుకుని విడిపోయారు. 2023లో జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్లకు ఓ కుమారుడు ఉన్నాడు.
భర్తతో అమలా పాల్..
View this post on Instagram