The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమన్నారంటే?
హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదాశర్మ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమావిడుదలకు ముందే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. చాలా రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధం విధించగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఏకంగా పన్ను మినహాయింపును ప్రకటించాయి
హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదాశర్మ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమావిడుదలకు ముందే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. చాలా రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధం విధించగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఏకంగా పన్ను మినహాయింపును ప్రకటించాయి. వివాదాలెలా ఉన్న బాక్సాఫీస్ వద్ద ది కేరళ స్టోరీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మే 5 విడదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కాగా సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటోంది మూవీ యూనిట్. దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తూ జనాల్లోకి తమ సినిమాను వెళ్లేలా ప్రమోట్ చేస్తున్నారు. కాగా ది కేరళ స్టోరీ ప్రమోషన్స్లో భాగంగా విరామం లేకుండా వరుస ప్రయాణాలు చేస్తున్నారు హీరోయిన్ అదాశర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్. దీంతో దర్శకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై సుదీప్తో సేన్ స్పందించారు. వరుస ప్రయాణాలతో డీహైడ్రెషన్ , ఇన్ఫెక్షన్ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, ఈరోజే (మే27) డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇంటికి పంపమని డాక్టర్లను కోరనున్నట్లు సుదీప్తోసేన్ తెలిపారు. కాగా ఇదిలా ఉండగా ది కేరళ స్టోరీ హీరోయిన్ అదా శర్మ ఇటీవల నెట్టింట వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడించింది. ఆన్లైన్లో తన కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ ఫోన్ నెంబర్ లీక్ చేసి కొందరు వ్యక్తులు తనను తీవ్ర స్థాయిలో వేధిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..