AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలూ, నువ్వు లేకుండా ఎలా ..?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రమఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

బాలూ, నువ్వు లేకుండా ఎలా ..?
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2020 | 4:49 PM

Share

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రమఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ, అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.  ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి కూడా బాలుకు ట్విట్టర్ లో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మిథునం చిత్ర షూటింగులో దిగిన కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేశారు. అవి ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.  మిథునం సినిమాకు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2012 లో వచ్చిన ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. బాలు, లక్ష్మీ మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తారు. తన మిథునం సినిమాలో బాలూనే హీరో అని చెప్పిన తనికెళ్ల భరణి, ఆయన జ్ఞాపకాలు జీవితాంతం గుండెల్లో పదిలంగా ఉంటాయని తెలిపారు.