Suriya: కెమెరామెన్స్ అత్యుత్సాహం.. అసహనం వ్యక్తం చేసిన సూర్య.. తన పిల్లలతో వద్దంటూ..
అయితే ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన హీరో కెమెరామెన్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యంత ఫ్యాన్ క్రేజ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో వాడీవాసల్ సినిమా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న సూర్య.. తాజాగా తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతున్నారు. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ముంభై వెళ్లిన సూర్య.. అక్కడున్న ఓ రెస్టారెంట్కు తన సతీమణి జ్యోతిక, పిల్లలతో కలిసి వెళ్లారు. అయితే ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన హీరో కెమెరామెన్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి సూర్య ముంబైలోని బాస్టియనల్ వోర్లీ హోటల్ కు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత వారిని ఫోటోగ్రాఫర్లు పలకరిస్తూ ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. సూర్య, జ్యోతిక ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడి నుంచి కారు దగ్గరకు వచ్చారు. అయితే ఫోటోగ్రాఫర్స్ సూర్య పిల్లలను సైతం ఫోటోలకు ఫోజులివ్వమంటూ వారిద్దరి ఫోటోస్ తీయే ప్రయత్నం చేశారు. దీంతో సూర్య కెమెరామెన్స్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కెమెరాలకు చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ మా పిల్లల్ని వదిలేయండి అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
• @Suriya_offl Anna & #Jyotika Anni With Kids at Mumbai ❤️#Vanangaan #VaadiVaasal#RolexSir #suriya43 pic.twitter.com/JW2OjbWERx
— Aswin Sasi 103 (@NadippinNayak13) August 10, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.