AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: జాన్వీ కపూర్ చేసిన పనికి సీరియస్ అయిన శ్రీదేవి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ వీడియో

శ్రీదేవి అకాల మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు.

Sridevi: జాన్వీ కపూర్ చేసిన పనికి సీరియస్ అయిన శ్రీదేవి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ వీడియో
Sridevi, Jhanvi Kapoor
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2023 | 12:12 PM

Share

అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి నేటికి ఐదేళ్లు అవుతోంది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లోని ఓ హోటల్ లో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. శ్రీదేవి అకాల మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. శ్రీదేవి వారసురాలిగా ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది. శ్రీదేవి చనిపోయిన తర్వాత జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దఢక్  సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే శ్రీదేవి అంటే జాన్వీకి చాలా ఇష్టం. ఆమెను తలుచుకొని చాలా సార్లు ఎమోషనల్ అయ్యింది జాన్వీ.

తాజాగా శ్రీదేవి, జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఒక ఈవెంట్ కు హాజరైన సమయంలో తల్లితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు జాన్వీని సింగిల్ గా ఫోటో దింపేందుకు అడిగారు.

జాన్వీ కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ శ్రీదేవి దానికి ఒప్పుకోలేదు. జాన్వీ ఫోటో దిగేందుకు ఆసక్తి చూపినా శ్రీదేవి సీరియస్ అవ్వడంతో ఆమె నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఫోటోగ్రాఫర్స్ కు సారి కూడా చెప్పింది జాన్వీ. ఇప్పుడు ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.