AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

తెలుగు, తమిళ సినిమా రంగాలలో అత్యంత ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు పొందిన సావిత్రి 'మహానటి'గా ప్రసిద్ధి చెందారు. ఆమె 250కి పైగా సినిమాల్లో నటించారు. 'మాయాబజార్', 'దేవదాసు', 'మిస్సమ్మ' వంటి చిత్రాలు ఆమె నటనతో ఫిదా అయ్యారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో సీనియర్ నటి జమున సావిత్రి జీవిత కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..
Jamuna, Savitri
Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 8:45 AM

Share

సీనియర్ నటి జమున గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను, ముఖ్యంగా దివంగత నటి సావిత్రి జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో తనకున్న అనుభవాలను జమున వివరించారు. ఒకానొక సందర్భంలో తనను బహిష్కరించే ప్రయత్నం జరిగినప్పుడు కూడా రామారావు, నాగేశ్వరరావు ఐకమత్యంగా వ్యవహరించారని తెలిపారు. గుండమ్మ కథలో నటించేందుకు రాజీ కుదిరిన తర్వాత, రామారావుతో, ఆ తర్వాత నాగేశ్వరరావుతో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో రామారావు కాలు పట్టుకునే సన్నివేశంలో, తాను కాలుతో కిరీటాన్ని తన్నినప్పుడు రామారావు ఎంతో స్పోర్టివ్‌గా స్పందించారని జమున వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

సావిత్రి సినీ జీవితం, ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులపై మాట్లాడుతూ, సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు (కులం దైవం) చిత్రం ఆమె ఆర్థిక పతనానికి కారణమైందని జమున స్పష్టం చేశారు. బి. మధుసూదనరావు, గుమ్మడితో కలిసి రష్యా పర్యటనలో చూసిన ఒక రష్యన్ చిత్ర కథనే మధుసూదనరావు భార్య సరోజిని చిన్నారి పాపలుగా రాశారని తెలిపారు. సావిత్రి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి మొత్తం మహిళలే సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరే సమయానికి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో, సావిత్రి తన ఇంటిని, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందని జమున వివరించారు. ఇదే సావిత్రి ఆర్థిక పతనానికి మొదటి మెట్టు అని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఆ తర్వాత సావిత్రి మూగ మనసులు చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం పేరుతో రీమేక్ చేయాలని ప్రయత్నించారు. ఆ సమయంలో సావిత్రి జమునను నటించమని అడిగినప్పుడు, జమున గర్భవతి కావడంతో నటించలేకపోయారు. ఆ స్థానంలో చంద్రకళను తీసుకున్నారు. శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ దాదాపు ఐదేళ్లు కొనసాగిందని జమున తెలిపారు. సినిమా నిర్మాణం మధ్యలో శివాజీ గణేశన్ చిత్రాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఆయన మార్కెట్ పడిపోయిందని, దీని ప్రభావం ప్రాప్తం సినిమాపై పడిందని వివరించారు. సగం సినిమా పూర్తయిన తర్వాత వచ్చిన ఒక కొనుగోలుదారు ఆఫర్‌ను సావిత్రి తిరస్కరించారని, ఇంకా ఎక్కువ వస్తుందని భావించారని జమున తెలిపారు. అయితే, శివాజీ గణేశన్ మార్కెట్ పడిపోవడంతో కొనుగోలుదారులు లేకుండాపోయి, సినిమా విడుదల చేయడం కూడా కష్టమైందని జమున పేర్కొన్నారు. ఈ సంఘటనలన్నీ సావిత్రి ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచాయని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us