Satyadev: “అన్నయ్య మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారు” సత్యదేవ్ ఎమోషనల్ ట్వీట్

వర్సటైల్ యాక్టర్ గా తనదైన ముద్ర వేశాడు సత్యదేవ్. క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జోతిలక్ష్మీ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు సత్యదేవ్.

Satyadev: అన్నయ్య మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారు సత్యదేవ్ ఎమోషనల్ ట్వీట్
Satyadev
Follow us

|

Updated on: Sep 27, 2022 | 8:09 PM

వర్సటైల్ యాక్టర్ గా తనదైన ముద్ర వేశాడు సత్యదేవ్. క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జోతిలక్ష్మీ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు సత్యదేవ్. ఆతర్వాత హీరోగా సినిమాలు చేశాడు సత్యదేవ్. హీరోఐజం మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక ఓపాత్రలో నటిస్తున్నాడు ఈ వర్సటైల్ హీరో.

ఇక ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు సత్యదేవ్. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సత్యదేవ్ ను మెగాస్టార్ చిరంజీవే రికమెండ్ చేశారట. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. సత్యదేవ్ అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అనే అనుకోని డైరెక్టర్ మోహన్ రాజాకు రికమెండ్ చేశానని అన్నారు. సత్యదేవ్ ఆ పాత్రలో అద్భుతంగా కంటించాడని నా పేరు నిలబెడతాడని అన్నారు చిరు. దీని పై తాజాగా సత్యదేవ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. “అన్నయ్యా.. ఒక అభిమానిగా నేను మీకు ప్రేమని మాత్రమే ఇవ్వగలిగాను. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారు.. థాంక్యూ” అంటూ రాసుకొచ్చాడు సత్యదేవ్. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాతో సత్య దేవ్ కెరీర్ ఉపందుకుంటుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.