AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై సంధ్యా రెడ్డి స్పందించారు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని, దీనికి కేసు పెట్టడం తగదని ప్రశ్నించారు. కేసులకు భయపడనని, ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు. స్వేచ్ఛ అంటే ఆర్థిక, సామాజిక ఎదుగుదల తప్ప, దుస్తులలో కాదని అభిప్రాయపడ్డారు.

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి
Sandhya Reddy
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2026 | 5:51 AM

Share

అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై బొజ్జా సంధ్యా రెడ్డి స్పందించారు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా, నీట్‌గా, నిండుగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని ఆమె వెల్లడించారు. పద్ధతిగా ఉండాలని చెబితేనే కేసు పెడతారా అంటూ ఆమె ప్రశ్నించారు. తనకు కేసులకు భయపడే వ్యక్తిని కాదని, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని సంధ్యా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై తన వరకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని, వచ్చిన తర్వాత తన న్యాయవాదిని సంప్రదిస్తానని ఆమె పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సగం సగం దుస్తులతో కనిపించడం వల్ల పిల్లలు ప్రభావితమవుతున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తెచ్చారని సంధ్యా రెడ్డి తెలిపారు. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదిగి, అన్ని రంగాలలో ముందుకు రావడమేనని ఆమె నిర్వచించారు. దుస్తులలో స్వేచ్ఛ లేదని, మన కట్టుబాట్లను, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. అనసూయ పెట్టిన కేసులకు భయపడబోనని సంధ్యా రెడ్డి నొక్కి చెప్పారు.