Shaakuntalam: సామ్ సినిమాతో సరికొత్త ప్రయోగం.. త్రీడీ ఎఫెక్ట్స్తో ఆ కాలానికి తీసుకెళ్తారట..
టెక్నాలజీ రోజు రోజు మారుతూ వస్తోంది. కొత్తపుంతలు తొక్కుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలోనూ మార్పులు వస్తున్నాయి.
టెక్నాలజీ రోజు రోజు మారుతూ వస్తోంది. కొత్తపుంతలు తొక్కుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సినిమాలను 3డీ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ లో మాత్రమే 3డీ సినిమాలు వచ్చేవి.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడలో కిచ్చా సుధీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా 3డీలో వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమాను కూడా 3ఢీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు స్ట్రయిట్ తెలుగు సినిమా ఏదీ త్రీడీ లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఓ తెలుగు సినిమా త్రీడీ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఎదో కాదు సమంత నటించిన శాకుంతలం.
శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథను ‘శాకుంతలం’ పేరుతో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోన్న.. ఈ సినిమాను దిల్రాజు సమర్పిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని త్రీడీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తాజాగా తెలియజేసింది. ఈ కారణంగానే చిత్రాన్ని నవంబరు 4 నుంచి మరో కొత్త తేదీకి వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
‘‘మేం ‘శాకుంతలం’తో ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందించాలని.. ఆ ప్రపంచంలో అందరినీ లీనమయ్యేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం త్రీడీ వెర్షన్ను ఒక అద్భుతమైన మార్గంగా భావించాం. దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి మాకు మరింత సమయం కావాలి. మేము త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా. మరి ఈ సినిమా త్రీడీ ఎఫెక్ట్స్ తో ఎలా అలరిస్తుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.