AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ జోడిగా సాయి పల్లవి.. బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Ram Charan: రామ్ చరణ్ జోడిగా సాయి పల్లవి.. బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..
Ram Charan, Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2023 | 3:25 PM

Share

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి అనేక వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అలాగే మరో పాత్రలో హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నాడని సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఆసక్తికర వార్త వైరలవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ జోడీగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇదే నిజమైతే.. చరణ్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు.

ప్రస్తుతం చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆర్సీ16 ఎప్పుడూ పట్టాలెక్కుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ కృతి సనన్ కనిపించనుందని టాక్ నడిచింది. ఇప్పుడు సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.