AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV VYooham: వ్యూహం సినిమాను ముందు వారికి చూపించండి – ఆర్జీవీ మూవీకి హైకోర్ట్ కండీషన్

తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యూహం చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్ళింది. దీంతో ఈ సినిమా విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సింగల్ బెంచ్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. సినిమాకు సంబంధించిన రికార్డ్స్ అన్నిటిని సింగల్ బెంచ్ ముందు ఉంచారు సెన్సార్ బోర్డు సభ్యులు.

RGV VYooham: వ్యూహం సినిమాను ముందు వారికి చూపించండి - ఆర్జీవీ మూవీకి హైకోర్ట్ కండీషన్
Rgv Vyooham
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 11:58 AM

Share

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు మొదట ఈ సినిమాపై ఈనెల 11 వ తారీకు వరకు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యూహం చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్ళింది. దీంతో ఈ సినిమా విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సింగల్ బెంచ్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. సినిమాకు సంబంధించిన రికార్డ్స్ అన్నిటిని సింగల్ బెంచ్ ముందు ఉంచారు సెన్సార్ బోర్డు సభ్యులు. అయితే వాదనలో భాగంగా సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ ముందు సినిమా ప్రదర్శించిన తర్వాత రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా సెన్సార్ బోర్డ్ చిత్రానికి సర్టిఫికెట్ జారీచేయడాన్ని టిడిపి తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేసింది.

అయితే సెన్సార్ బోర్డు సభ్యులు మినహా ఈ చిత్రాన్ని మిగతా ఎవరూ కూడా చూడలేదు కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు హైకోర్టు నిర్ణయించుకుంది. గతంలో ముంబైలో ఒక సినిమా వివాదంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు బాంబే హైకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ కమిటీలో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తో పాటు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఒక వెటరన్ యాక్టర్ ను కమిటీ సభ్యులుగా నియమిస్తూ వారి ముందు చిత్రాన్ని ప్రదర్శించింది.. ఇప్పుడు వ్యూహం సినిమాలోనూ అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది హైకోర్టు. హైకోర్టు నిర్మించిన కమిటీలో సభ్యులుగా ఉన్నవారు శుక్రవారం లోపు సినిమాను చూసి శుక్రవారం రోజు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

వ్యూహం సినిమాకు సంబంధించిన ట్రైలర్ తో పాటు వీడియోలు అన్నిటిని పెన్ డ్రైవ్ రూపంలో హైకోర్టుకు సమర్పించారు నారా లోకేష్ తరపు న్యాయవాదులు. అయితే సినిమా విడుదల కాకుండా ఉంటే సినిమా కోసం పనిచేసిన యూనిట్ తీవ్రంగా నష్టపోతుందని సినిమా యూనిట్ తరపున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి సినిమాను తిసామని, చివరి నిమిషంలో హైకోర్టు తలుపు తట్టి సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ,సంబంధం లేని వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారని నిరంజన్ రెడ్డి వాదించారు.. కమిటీలో ఎవరెవరు ఉండాలనే పేర్లను పిటిషనర్ ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి