AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Movie : సంక్రాంతికి పై కన్నేసిన యానిమల్ టీమ్.. నిర్మాతల మాస్టర్ ప్లాన్

యానిమల్' సినిమా విడుదలై నెల రోజులు దాటినా కొన్ని చోట్ల ఇంకా ప్రదర్శితమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఆకర్షించేందుకు 'యానిమల్' టీమ్ టికెట్ ధర తగ్గించింది. దాంతో మరింత మంది ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ టెక్నిక్‌కి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. 

Animal Movie : సంక్రాంతికి పై కన్నేసిన యానిమల్ టీమ్.. నిర్మాతల మాస్టర్ ప్లాన్
Animal Movie OTT
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2024 | 8:44 AM

Share

బాలీవుడ్‌ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ‘యానిమల్’ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమాతో రణబీర్ సింగ్ భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో రణబీర్ కపూర్ క్రేజ్ భారీగా పెరిగింది. అలాగే రష్మిక మందన్న పాపులారిటీ కూడా పెరిగింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లు రాబట్టింది. ప్రపంచ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ‘యానిమల్’ సినిమా మొత్తం వసూళ్లు దాదాపు 900 కోట్ల రూపాయలు. ఇప్పుడు సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది యానిమల్ టీమ్.

యానిమల్’ సినిమా విడుదలై నెల రోజులు దాటినా కొన్ని చోట్ల ఇంకా ప్రదర్శితమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఆకర్షించేందుకు ‘యానిమల్’ టీమ్ టికెట్ ధర తగ్గించింది. దాంతో మరింత మంది ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ టెక్నిక్‌కి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా టికెట్ ధరను 100 రూపాయలకు తగ్గించారు.‘యానిమల్‌’ సినిమా విడుదలయ్యే సరికి టిక్కెట్‌ ధర ఎక్కువే ఉంది. అయినా కూడా అభిమానులు టిక్కెట్లు కొన్నారు.యానిమల్ సినిమాకు ఇప్పటికే వెయ్యి రూపాయల టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఈ సినిమా టికెట్ ధరను తగ్గించినట్లు నిర్మాత తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా సన్నివేశాలు, వైలెన్స్ ఎక్కువవుంది, డైలాగులు అసభ్యకరంగా ఉన్నాయని తదితర విమర్శలు చేశారు. అవి ఎలా ఉన్నా సినిమా సూపర్ హిట్ అయ్యింది. రణబీర్ కపూర్, రష్మిక మందన్నతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ యానిమల్ లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.