AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: ‘మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరువలేం’.. అంబానీ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్, ఉపాసన

గుజరాత్‌ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు సైతం సందడి చేశారు. అలాగే మన దేశానికి చెందిన పలువురు సినీ తారలు, క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రమే అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.

Upasana Konidela: 'మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరువలేం'.. అంబానీ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్, ఉపాసన
Upasana, Ram Charan, Mukesh Ambani
Basha Shek
|

Updated on: Mar 05, 2024 | 7:52 AM

Share

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ముగిశాయి. గుజరాత్‌ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు సైతం సందడి చేశారు. అలాగే మన దేశానికి చెందిన పలువురు సినీ తారలు, క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రమే అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ లతో కలిసి నాటు నాటు సాంగ్ ను రీక్రియేట్ చేశాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇదిలా ఉంటే తమను ఈ వేడుకలకు ఆహ్వానించి మర్చిపోలేని ఆతిథ్యాన్ని అందించిన అంబానీ కుటుంబ సభ్యులకు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్ దంపతులు. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఉపాసన..’అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ లకు శుభాకాంక్షలు. అలాగే అభినందనలు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా జీ- ముఖేశ్ జీ మీ ఆతిథ్యం సాటిలేనిది.. ఇందుకు గానూ మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి ధన్యవాదాలు. అద్భుతమైన వ్యక్తులతో.. అద్భుతమైన సమయం వెచ్చించినందుకు సంతోషంగా ఉంది’ అని తన ఆనందానికి అక్షర రూప మిచ్చారు ఉపాసన.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఖాన్ త్రయంతో రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పు వేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. అలాగే ముఖేష్ అంబానీ ఎంతో ఆప్యాయంగా రామ్ చరణ్ తో ముచ్చటిస్తున్న ఫొటో కూడా ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసన..

అత్తమ్మ పుట్టిన రోజు సందర్భంగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..