AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan First Day Collections: పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పెట్టింది ఎంత ?.. వచ్చింది ఎంతంటే..

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల నటించగా.. మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Ponniyin Selvan First Day Collections: పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పెట్టింది ఎంత ?.. వచ్చింది ఎంతంటే..
Ponniyin Selvan
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2022 | 1:46 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, త్రిష, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. విడుదలై మొదటి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకత్వం.. నటీనటుల నటనపై ప్రేక్షకులు.. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఫస్ట్ డే భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన విక్రమ్, వాలిమై చిత్రాలను వెనక్కు నెట్టింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ. 39 కోట్లు రాబట్టింది. తమిళంలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

తమిళనాడులో ఈ సినిమా శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ. 23.50 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్లు.. కర్ణాటకలో రూ. 4 కోట్లు.. కేరళలో రూ. 3.25 కోట్లు.. నార్త్ ఇండియాలో కేవలం రూ. 2.75 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం రూ. 39 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్ రోజులలో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ వసూళు చేయనున్నట్లు ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మణిరత్నం. ఇందులో చోళుల రాజవంశం గురించి.. వారి కాలంలో జరిగిన చారిత్రక సంఘటనలను వెండితెరపై చూపించారు. ఈ సినిమాను దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‏తో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.