Nithiin: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‏తో నితిన్ మరో సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ కాంబో రిపీట్ కానుందా ?

యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ నితిన్ కెరీర్‍లో వన్ ఆఫ్ ది హిట్‏గా నిలిచింది

Nithiin: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‏తో నితిన్ మరో సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ కాంబో రిపీట్ కానుందా ?
Nithiin
Follow us

|

Updated on: Nov 06, 2022 | 12:15 PM

టాలెంటెడ్ హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా నితిన్‏ తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కి్ల్లో వినిపిస్తుంది. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ భీష్మ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. 2020లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ నితిన్ కెరీర్‍లో వన్ ఆఫ్ ది హిట్‏గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందట.

తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. వెంకీ దర్శకత్వంలో నితిన్ మరోసారి నటించనున్నాడట. త్వరలోనే వీరిద్దరి ప్రాజెక్ట్‏కు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే గతంలో వెంకీ మెగాస్టార్ చిరంజీవితో మూవీ తెరకెక్కించేందుకు కమిట్ అయ్యారు. కానీ చిరు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో వీరిద్దరి కాంబో ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈలోపు నితిన్ మూవీని ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లుగా సమాచారం. అయితే నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గమనించకపోవడం గమనార్హం.