Nani 29 : వరుస సినిమాలతో దూకుడుమీదున్న నేచురల్ స్టార్.. నయా ప్రాజెక్ట్ ఓకే చేసిన నాని..
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి యమా స్పీడ్ గా ఆయా షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. రీసెంట్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్
Nani 29 : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్లో పెట్టి యమా స్పీడ్గా ఆయా షూటింగ్లను పూర్తి చేస్తున్నాడు. రీసెంట్గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటించాడు నాని. ఈ సినిమా థియేటర్స్కు నో చెప్పి ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో నాని సరసన తెలుగమ్మాయి రీతువర్మ నటించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతోపాటు అలానే నాని ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా నాని మరో సినిమాను ఓకే చేశారు. నాని కెరీర్ లో 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న రానుంది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :