Thandel Movie: ఇక నాగ చైతన్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు.. కలెక్షన్లలో అరుదైన ఘనత అందుకున్న తండేల్
ఇక అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకోవచ్చు. అవును అతను నటించిన లేటెస్ట్ సినిమా తండేల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమిది. రిలీజ్ కు ముందే తండేల్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఓవైపు సినిమా హెచ్ డీ వెర్షన్ లు ఆన్ లైన్ లో లీకయినా ఆడియెన్స్ థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘బాక్స్ ఆఫీస్ దుళ్లకొట్టేసారు.. థియేటర్స్ కి జాతర తెచ్చేసారు. తండేల్ బ్లాక్ బస్టర్ సునామీ. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటేసింది’ అంటూ తండేల్ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.
కాగా నాగ చైతన్య తో పాటు అక్కినేని ఫ్యామిలీలో ఇదే మొదటి వంద కోట్ల సినిమా. దీంతో నాగ చైతన్య అభిమానులు తెగ హ్యపీగా ఫీలవుతున్నారు. ఇక ఓవర్సీస్లో తండేల్ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ దాటింది. మొత్తానికి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటల పయనిస్తోంది తండేల్.
10 రోజుల్లోనే..
బాక్స్ ఆఫీస్ దుళ్లకొట్టేసారు.. థియేటర్స్ కి జాతర తెచ్చేసారు 💥💥#Thandel is a BLOCKBUSTER TSUNAMI ❤️🌊🔥#BlockbusterThandel crosses 𝟏𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 💥💥
Book your tickets now! 🎟️ https://t.co/5Tlp0WMUKb#100CroresThandelJaathara pic.twitter.com/wVug1dG9X1
— Thandel (@ThandelTheMovie) February 16, 2025
కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








