AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Vibhushan: ఇండస్ట్రీలో ఇప్పటివరకు ‘పద్మ విభూషణ్’ అందుకున్న నటీనటులు వీరే.. తెలుగులో ఆ హీరో తర్వాత చిరుకే..

గతరాత్రి ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది.

Padma Vibhushan: ఇండస్ట్రీలో ఇప్పటివరకు 'పద్మ విభూషణ్' అందుకున్న నటీనటులు వీరే.. తెలుగులో ఆ హీరో తర్వాత చిరుకే..
Rajinikanth, Chiranjeevi, A
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2024 | 3:12 PM

Share

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గానూ ఈ గౌరవం లభిస్తుంది. అయితే గతరాత్రి ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న హీరో మెగాస్టార్ కావడం విశేషం. ఇంతకీ చిరు కంటే ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరో ఎవరో తెలుసా?. ఆయనే నట దిగ్గజం.. దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తర్వాత చిరంజీవిని ఈ అవార్డ్ వరించింది. దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఈ అవార్డ్ కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. ఇంతకీ ఎవరెవరో తెలుసుకుందామా.

1. దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు. 2015లో కేంద్రప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

2. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను పద్మవిభూషణ్ అవార్డ్ వరించింది. 2015లో అమితాబ్ కు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. అంతుకు ముందే ఆయనకు షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బీ బిరుదులు ఉన్నాయి.

3. కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కు సినీ రంగంలో చేసిన సేవలకు గానూ 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్రం.

4. 2011లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించింది కేంద్రం.

5. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. 2024లో ఆయనతోపాటు ప్రముఖ నటి వైజయంతిమాల సైతం ఈ అవార్డ్ అందుకోనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.