Ajith Kumar: డేర్ డెవిల్తో కలిసి బైక్ రైడింగ్.. ఎగిరి గంతేసిన హీరోయిన్.. రోడ్డు ట్రిప్లో ‘తునివు’ జంట..
ఇప్పుడు తునీవు సినిమా తర్వాత కూడా అజిత్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన లఢఖ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి కేవలం అజిత్ మాత్రమే కాదు.. హీరోయిన్ మంజు వారియర్ సైతం అజిత్తో కలిసి బైక్ రైడింగ్ వెళ్లనుందట.
తమిళ్ స్టార్ అజిత్ కుమార్కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా తునీవు సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ జోడిగా మంజు వారియర్ కథానాయికగా నటించింది. అయితే షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికినా.. బైక్ రైడింగ్ వెళ్తుంటారన్న సంగతి తెలసిందే. ఇక ఇప్పుడు తునీవు సినిమా తర్వాత కూడా అజిత్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన లఢఖ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి కేవలం అజిత్ మాత్రమే కాదు.. హీరోయిన్ మంజు వారియర్ సైతం అజిత్తో కలిసి బైక్ రైడింగ్ వెళ్లనుందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తనను బైక్ ట్రిప్కు రమ్మని అజిత్ ఆహ్వానించారని… అందుకు తాను వెంటనే అంగీకరించినట్లు తెలిపింది. ఇంతకు ముందు మరొక రైడర్తో కలిసి పిలియన్ రైడ్ చేసింది. వీరు లెహ్-లడఖ్.. కాశ్మీర్ మీదుగా 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంజు మాట్లాడుతూ.. వర్షం నుంచి మంచు వరకు అన్ని రకాల ప్రకకృతిని అనుభవిస్తూ అజిత్ ప్రయాణించిన రోడ్ ట్రిప్కు తనను ఆహ్వానిస్తాడని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొంది.
“అజిత్ ఆ గ్రూప్లోని ప్రతి ఒక్కరికీ అన్ని సేఫ్టీ గేర్లు ఉండేలా చూసుకున్నాడు. నేను దాదాపు ఐదు సార్లు కింద పడ్డాను. పడిపోయినప్పుడు మళ్లీ ఎలా నిలబడాలనే విషయాన్ని తన నుంచి నేర్చుకున్నాను. మేము పాంగోంగ్ సరస్సు, లుబ్రా లోయ, హిమాలయాల నుంచి వెళ్ళాము. దాదాపు 45 కిలోమీటర్ల మేర ఆఫ్రోడింగ్ కూడా చేశాం’’ అని మంజు చెప్పారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.