Akhanda : ‘అఖండ’ సక్సెస్ మీట్కు ఇద్దరు స్పెషల్ గెస్ట్స్.. ఆ స్టార్స్ ఎవరంటే ..
నట సింహం నందమూరి బాలయ్య నటించిన సినిమా అఖండ.. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
Akhanda : నట సింహం నందమూరి బాలయ్య నటించిన సినిమా అఖండ.. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాలయ్య దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ అఖండ విజయం సాధించింది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్న జై బాలయ్య నినాదాలే వినిపిస్తున్నాయి.అదేవిధంగా చాలా కాలం తర్వత పెద్ద సినిమా థియేటర్స్ కు రావడం.. వచ్చి బ్లాక్తో బస్టర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక బాలయ్యను మాస్ అభిమానులకు ఎలా చూపించాలో బోయపాటికిబాగా తెలుసు.. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో త్వరలోనే సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు స్టార్స్ రానున్నారని ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.
అఖండ సక్సెస్ మీట్ కు గెస్ట్ లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని తెలుస్తుంది. ఇక తారక్ రానున్నాడన్న వార్తతో నందమూరి అభిమానులు ఆనందం ఆకాశాన్ని తాకింది. ఇక మరో గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నడని తెలుస్తుంది. ఇక ఇప్పటికే మహేష్ అటు తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరయ్యాడు.. అలాగే నట సింహం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు కూడా హాజరయ్యాడు. అలాగే తారక్ కు మహేష్ కు మంచి స్నేహసంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ అఖండ సక్సెస్ మీట్ కు రానున్నడని తెలుస్తుంది. అలాగే తారక్ కూడా హాజరు కానున్నాడట.. ఈ కార్యక్రమం డిసెంబర్ 8న జరగనుందని తెలుస్తుంది. దాంతో అటు నందమూరి అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్ సంతోషంలో తేలిపోతున్నారు. మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది..
మరిన్ని ఇక్కడ చదవండి :