AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. రెండు పార్టులుగా మహేష్ బాబు సినిమా ?..

ప్రస్తుతం ఆయన మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరిలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్‏లో ఈ సినిమా ఉండబోతుందని.. ఇప్పటికే మహేష్ న్యూలుక్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నారట రాజమౌళి.

Mahesh Babu: జక్కన్న మాస్టర్ ప్లాన్.. రెండు పార్టులుగా మహేష్ బాబు సినిమా ?..
Mahesh Babu, Rajamouli
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 5:53 PM

Share

ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్నే ఫిదా చేశారు డైరెక్టర్ రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది. జక్కన్న టేకింగ్, స్క్రీన్ ప్లే పై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరిలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్‏లో ఈ సినిమా ఉండబోతుందని.. ఇప్పటికే మహేష్ న్యూలుక్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నారట రాజమౌళి. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఫిల్మ్ సర్కిల్లో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2 పార్టులుగా తీసుకురాబోతున్నారట జక్కన్న. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని.. మొదటి పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ కి పైగా స్టోరీని ల్యాగ్ చేయకుండా స్క్రీన్ ప్లేతోనే రెండు భాగాలుగా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ తెగ నడుస్తోంది. ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్న సలార్, దేవర చిత్రాలు రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ సినిమా సైతం వచ్చి చేరిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల గురూజీ బర్త్ డే సందర్భంగా విడుదలైన ధమ్ మసాలా సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.