AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: జగన్‌తో ముగిసిన మంచు విష్ణు భేటీ.. దేని గురించి చర్చించారంటే..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‏ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు.

Manchu Vishnu: జగన్‌తో ముగిసిన మంచు విష్ణు భేటీ.. దేని గురించి చర్చించారంటే..
Vishnu
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2022 | 4:28 PM

Share

Manchu Vishnu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‏ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్ నారయణ మూర్తి, పోసాని..ఇతర సినీ ప్రముఖులు సీఎం జగన్‏తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ తో వ్యక్తిగత మీటింగ్ మాత్రమే అని తెలియజేశారు మంచు విష్ణు. అలాగే తిరుపతిలో స్టూడియోను కడతానని విష్ణు తెలిపారు.  ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మంచు మోహన్ బాబు, మంచు విష్ణును కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ కూడా వ్యక్తిగతం మాత్రమే మోహన్ బాబు తెలిపారు. అయితే చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి..జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే సినీ పరిశ్రమలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు పరిష్కారం కానున్నాయని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Pilli: దీపికా పిల్లి అందాల విందు మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..