AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ లో వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది.

DC OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
Dc
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 1:11 PM

Share

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా హీరోగా మారిన విషయం తెలిసిందే.. లోకేష్, వామిక గబ్బి జంటగా అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా డీసీ. ఆగస్టు 07న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సినిమా విడుదలకు ముందు కూడా ఈ సినిమా పై పెద్దగా ప్రమోషన్స్ కూడా జరగలేదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రెండో రోజుకు బాగా పుంజుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మౌత్ టాక్‌తోనే వసూళ్లు పెంచుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అయితే ఈ డీసీ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డీసీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ  సన్ నెక్స్ట్ డీసీ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది సన్ నెక్స్ట్ . తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ సినిమా కోసం అడియాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటికే డీసీ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇక ఆడియన్స్ తో పాటు సినీ సెలబ్రెటీలు కూడా డీసీ సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేశారు. మహేష్ బాబు,  అల్లు అర్జున్, ఇలా పలువురు స్టార్స్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

View this post on Instagram

A post shared by SUN NXT (@sunnxt)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us