Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గత కొద్ది రోజులుగా కరోనాla బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముంబైలోని

Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..
Latha Mangeshkar
Follow us

|

Updated on: Jan 23, 2022 | 9:56 AM

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గత కొద్ది రోజులుగా కరోనాla బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై గురించి ఆమెను పరీక్షిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పందించారు.

ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. అయితే ఆమెను ఇంకా ఐసీయూలోనే ఉంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. అలాగే.. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.

ఇక మరోవైపు.. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. జనవరి 8న లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. అప్పటినుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు 15 రోజులు గడిచినా ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి చెరుకుంటారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..

Latest Articles