Mahesh Babu and Trivikram: సరికొత్త మహేష్ను చూపించడానికి సిద్దమవుతున్న గురూజీ..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Mahesh Babu and Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే దుబాయ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న టీమ్. ఇటీవలే గోవాలో మారో షెడ్యూల్ను మొదలు పెట్టారు. తాజాగా అక్కడ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే తిరిగి హైదరాబాద్లో షూటింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాకథ ఉండనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు చిత్రయూనిట్. మహేష్ బాబు పుటిన రోజు కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఎలా ఉండబోతుందన్న దానిపై మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ సూపర్ హిట్ అవ్వగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఖలేజా’ పర్వాలేదు అనిపించింది. కానీ ఈ రెండు సినిమాలు టీవీలో మాత్రం సూపర్ హిట్స్గా నిలిచాయి. టెలికాస్ట్ అయిన ప్రతిసారి మంచి టీఆర్ఫీని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు. మహేష్ ఈ సినిమా చాలా కొత్తగా కనిపించనున్నాడట. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉండనున్నాయట. అంతే కాదు వీఎఫ్ఎక్స్ వర్క్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో మహేష్కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :