Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి

PV Sindhu: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు సినీ ప్రముఖులు సన్మానం చేశారు. నటులు చిరంజీవి, రాధికా శరత్‌ కుమార్‌ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు..

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి
Follow us
Subhash Goud

|

Updated on: Aug 28, 2021 | 7:19 PM

PV Sindhu: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు సినీ ప్రముఖులు సన్మానం చేశారు. నటులు చిరంజీవి, రాధికా శరత్‌ కుమార్‌ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అలాగే ఈ సన్మాన కార్యక్రమంలో నటీనటులు సుహాసిని, నాగార్జున, రానా తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు పీవీ సింధుని శాలువాతో సత్కరించారు. హైదరాబాద్‌లో ఆమెకు ఈ ఘన సత్కారం లభించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతుంటే.. తాజాగా వీడియోను చిరంజీవి షేర్‌ చేశారు. ఇందులో సీనియర్‌ నటి రాధిక, పీవీ సింధు, చిరంజీవి కలిసి ఫోటో దిగారు. రాధిక.. సింధు గెలుచుకున్న మెడల్‌ని పట్టుకుని నవ్వుతూ పోజులివ్వడం ఆకట్టుకుంటుంది.

దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందంటూ సినీ ప్రముఖులు పేర్కొన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌గా రికార్డు సృష్టించింది.