Cinema : థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్.. నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఏకంగా 102 రోజులు ఆడింది. ఇప్పుడు నాలుగు నెలలుగా ఓటీటీలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.

2025లో విడుదలైన ఒక స్పై-థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో చరిత్ర సృష్టించిన ఈ చిత్రం, గత మూడున్నర నెలలుగా నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోతుంది. తన బడ్జెట్కు దాదాపు ఐదు రెట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్ హోదాను సంపాదించిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు “ధురందర్”. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలోని సస్పెన్స్ , ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు ప్రేక్షకులు ఇప్పటికే ముగ్ధులయ్యారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ , ఆర్. మాధవన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..
రణవీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ విజయంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో సునామీలా బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం, గత మూడున్నర నెలలుగా ఓటీటీ ప్లాట్ఫామ్లను శాసిస్తుంది. ఇది టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో స్థిరంగా నిలుస్తోంది. వారాంతం అయినా, వారం మధ్యలో అయినా, ప్రేక్షకులు ఈ అద్భుతమైన చిత్రాన్ని పదే పదే చూస్తున్నారు. ఇందులో రణవీర్ సింగ్, హంజా అలీ మజారీ అనే ఒక భారతీయ గూఢచారి పాత్రను పోషించాడు. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న ల్యారీ టౌన్లో విలసిల్లుతున్న ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ను నిర్మూలించడానికి, అతన్ని ఒక ప్రమాదకరమైన, రహస్య మిషన్పై అక్కడికి పంపుతారు.
ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..
దేశభక్తి, దౌత్యం, రహస్య మిషన్లు, భీకరమైన గ్యాంగ్ వార్తో అల్లిన ఈ కథ, ప్రేక్షకులను చివరి వరకు సీట్ల అంచున కూర్చోబెడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత, అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విలన్ రెహమాన్ డకాయిట్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. రూ.250 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా జనవరి 30న నెట్ఫ్లిక్స్లో విడుదలై ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..
