Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా ఎక్కువైపోయింది. దీనితో సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది...

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 10, 2021 | 11:52 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా ఎక్కువైపోయింది. దీనితో సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. తమ సినిమా అప్‌డేట్స్‌ను పంచుకోవడమే కాకుండా లైవ్ చాట్స్‌తో హీరోహీరోయిన్లు ఫ్యాన్స్‌కు కనెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ పిక్స్ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అకేషన్ దొరికినప్పుడల్లా.. లేదా ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు హీరోయిన్లు తమ చైల్డ్‌హుడ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

కళ్లతో కట్టిపడేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. తల్లి పక్కనే కూర్చుని ఫోటోకి పోజిచ్చిన ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఈమెకు తెలుగునాట యమా క్రేజ్ ఉంది. ఎక్స్‌పోజింగ్ అనేది లేకుండా అందం, అభినయంతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అలనాటి నటి ‘సావిత్రి’ పాత్రలో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా.? ఆమెవరో కాదు కీర్తి సురేష్.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 30కి పైగా చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో ‘నేను శైలజా’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘రెమో’, ‘నేను లోకల్’, రజిని మురుగన్’ లాంటి సూపర్ హిట్స్ అందుకుంది. ఇక ‘మహానటి’లో తన నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ‘గుడ్ లక్ సఖి’, ‘సర్కారు వారి పాట’, ‘సాని కాయిధం’, ‘భోళా శంకర్’, ‘వాశి’ సినిమాల్లో నటిస్తోంది.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!