Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. జై బాలయ్య సాంగ్‌ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

థమన్ సంగీత సారథ్యంలో జై బాలయ్య అనే ఆంథమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అభిమానుల్లో జోష్ నింపేలా ఉన్న ఈ సాంగ్‌ను కరీముల్లా ఆలపించారు. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ లిరిక్స్‌తో ఆడియన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పించారు రామజోగయ్య శాస్త్రి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. జై బాలయ్య సాంగ్‌ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే
Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 11:30 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. మాస్ యాక్షన్‌ స్పెషలిస్ట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ..2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. థమన్ సంగీత సారథ్యంలో జై బాలయ్య అనే ఆంథమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అభిమానుల్లో జోష్ నింపేలా ఉన్న ఈ సాంగ్‌ను కరీముల్లా ఆలపించారు. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ లిరిక్స్‌తో ఆడియన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పించారు రామజోగయ్య శాస్త్రి. ‘ రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ సాగే ఈ పాటలో మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్‌, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణ లుక్‌ అదిరిపోయింది. ఇక స్టైలిష్‌ గాగుల్స్‌తో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులకు కనులవిందుగా అనిపించాయి.

కాగా వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్‌ హీరో దునియా విజయ్‌ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు రవిశంకర్‌, హానీ రోజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి