AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. ఆస్పత్రిలో చేరిందంటూ వార్తలు.. మేనేజర్‌ ఏమన్నారంటే?

కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయినా చేతికి సెలైన్‌ పెట్టుకుని మరీ యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పింది. శరీరం సహకరించలేకపోయినా తనవంతు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది.

Samantha: సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. ఆస్పత్రిలో చేరిందంటూ వార్తలు.. మేనేజర్‌ ఏమన్నారంటే?
Yashoda ott
Basha Shek
|

Updated on: Nov 24, 2022 | 9:54 AM

Share

ప్రముఖ నటి సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మళ్లీ ఆస్పత్రిలో చేరినట్లు తమిళ ఛానెల్స్‌లో బ్రేకింగ్‌ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వదంతులేనని కొట్టి పారేశారుసామ్‌ కుటుంబ సభ్యులు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్‌ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్‌ కోరాడు. కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయినా చేతికి సెలైన్‌ పెట్టుకుని మరీ యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పింది. శరీరం సహకరించలేకపోయినా తనవంతు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది.

కాగా సామ్‌ ప్రధాన పాత్రలో నటించినయశోద నవంబర్‌ 11న థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడంతో యశోద కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్‌ సంయుక్తంగా యశోదను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్‌, వరలక్ష్మి, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ తదితర ప్రముఖులు నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..